ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (Tangirala sowmya) రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంద్భంగా ముస్లీం సోదరులకు ముఠాయిలు పంచి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో నందిగామలో రంజాన్ వేడుకలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ దైవిక భావనలతో, ధార్మిక చింతనలతో గడుపుతూ… 30 రోజుల పాటు ఉప వాస దీక్షలు చేసి దైవ చింతనలో గడపడం అభినందనీయం అన్నారు. ‘ఈద్- ఉల్-ఫితర్’ (రంజాన్) పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఐదు మూల స్థంభాలు
నందిగామ (Nandigama) పట్టణంలోని ఈద్గా, పెద్ద మసీదు వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాం మతానికి మూలస్తంభాలన్నారు. ఈ ఐదు సూత్రాలను రంజాన్ మాసంలో పాటించడం గొప్ప అవకాశంగా ముస్లింలు భావిస్తారన్నారు. ప్రతి మతానికి ఓ మూలగ్రంథం ఉంటుంది. ఈ గ్రంథంలో మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఉంటాయన్నారు. ప్రపంచంలోని ముస్లింలందరికి పవిత్ర ఖురాన్ మార్గదర్శకమైనదన్నారు. అలాంటి ఖురాన్ ఆవిష్కృతమైన సందర్భమే పవిత్ర రంజాన్ అని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం గరుడనేత్రంని చూడండి
ధన్యవాదములు